Friday 13 February 2009

నాట్యం చేయుటలోఎవరు గొప్ప? రంభా, ఊర్వశియా

ఒకనాడు దేవలోకమున ఇంద్రుని సభలో రంభ, ఊర్వశి నాట్యంలో ఒకరికంటే ఒకరు గొప్పవారమని కీచులాడుకొనేను. తుదకు దేవేంద్రుని వద్దకుపోయి మా యిరివురిలో నాట్యం చేయుటలో ఎవరు గోప్పవారో చెప్పమని అడిగెను. దేవేంద్రుడు ఏమి చెప్పవలేనో తోచక మునిశ్వరులతోను, దేవతలతోను సభ ఏర్పాటు చేసి వారిద్దరిలో ఎవరు నాట్యం బాగా చేయగలరో నిర్ణయించమని అడిగెను. దానికి రంభ, ఉర్వశిలిద్దరూ ఒకరిని మించినట్లు మరియొకరు నాట్యం చేసిరి. ఆ నాట్యం చూసిన దేవతలు, ఋషులు వారిద్దరిలో ఎవరు అధికులో, ఎవరు అధములో నిశ్చయించలేక "ఇద్దరును బాగానే నాట్యం చేసిరి. మీలో ఒకరు గొప్పవారు, మరిఒకరు తక్కువ వారని చెప్పుట వీలుకాదు. కావున భేధబుద్ది లేక అన్యోన్యంగా ఉండుము" అని చెప్పిరి. ఎవరు ఎంత చెప్పిన ఆ అప్సరసలు పట్టిన పట్టు విడువలేదు.మా యిద్దరిలో ఎవరుగొప్పవారో తేలనంతవరకు మేము నాట్యం చేయమని చెప్పిరి.

అదే సమయంన సభకు నారద మహర్షి వచ్చెను. విషయం తెలుసుకొని, "దేవేంద్రా!, భూలోకమున ఉజ్జయిని నగరంను మహాపరాక్రమంతుడు, దానశీలుడు, మేధావి, సకల విద్యలలో సంపూర్ణ పాండిత్యం గలవాడునగు విక్రమాదిత్యుడు పాలించుచున్నాడు. అతనిని పిలిపించినచో, ఎవరు గొప్పవాడో తేల్చి చెప్పగలడు" అని చెప్పెను. దేవేంద్రుడు నారదుని సలహా ప్రకారం ఉజ్జయినికి రథమును పంపి క్షణములో విక్రమాదిత్యుని సభకు రప్పించెను. సభలో ఉన్నవారిని పరిచయం చేసి తనను రప్పించిన కారణంను చెప్పెను. దేవేంద్రుని మాటలు విని విక్రమాదిత్యుడు ఆశ్చర్యనందములు పొంది తనకు కొంత వ్యవధి యిమ్మని కొరెను.

దేవేంద్రుదు అందుకు అంగీకరించగా విక్రమాదిత్యుడు సభ నుండి ఒక ఉద్యానవనమునకు పొయి,కొన్నిపూవులను కొసి రెండు పూలచెండ్లను చేసెను. వాటిలొ కొన్ని కీటకములను ఉంచెను. ఆ పూలబంతులను రంభకు, ఊర్వశికి ఇచ్చి నాట్యం చేయమనెను. వారు అందుకు అంగీకరించి పూలచెండ్లను పట్టి నాట్యం చేయనారంభించెను. రంభ తన చేతిలో ఉన్న పూలచెండును గట్టిగా అదిమి పట్టుకోనుటచే దానియందున్న కీటకములు చెదిరి ఆమెను కుట్టి బాధించసాగినవి. అందువలన ఆమె నాట్యం చేయుట కొంత తడబదసాగినది . ఊర్వశి తన చేతి యందున్న పూలచెండును మృదువుగా పట్టుకొని ఏవిధమైన బాధ పొందక హాయిగా నాట్యం చేసెను కొంతసేపు అలా వారి నాట్యప్రదర్శన జరిగిన తరువాత దేవేంద్రుడు విక్రమాదిత్యుడిని చూచి "వీరిద్దరిలో ఎవరు బాగుగా నాట్యం చేసిరి?" అని అడుగగా, "ఊర్వశి బాగుగా నాట్యం చేసెను" అని చెప్పెను.

అది విని దేవేంద్రుడు " ఆ విషయమును మీరు ఎలా నిర్ణయించిరి?" అని అడుగగా, దానికి విక్రమాదిత్యుడు రంభను, ఊర్వశిని చూచి, "మీకు నేనిచ్చిన పూలచెండ్లను ఇటు ఇవ్వండి" అని అడిగెను. రంభ నాట్యం చేస్తున్నపుడు దానిని క్రిందపడవేసెను. అందువలన తలవంచి నిలబడెను. ఊర్వశి తన చేతిలోనున్న చెండును విక్రమాదిత్యుని ఎదుట పెట్టెను. అప్పుడు విక్రమాదిత్యుడు దేవేంద్రుని చూచి," దేవేంద్రా!, వీరిద్దరిలో గలభేదములు గమనించితిరి కదా! రంభ నేనిచ్చిన చెండును క్రిందపడవేసెను. ఊర్వశి నేను ఇచ్చిన చెండును భద్రంగా పట్టుకొని నాట్యం చేసెను." అని చెప్పి, ఊర్వశి ఇచ్చిన చెండును దేవేంద్రుని ముందు విప్పి అందున్న కిటకములను చూపించి "ఊర్వశి ఈ చెండును మృదువుగా పట్టుకొని ఉన్నందున ఇందులోని కీటకములు బాధకలిగి ఆమెను కుట్టి బాధించసాగినది. ఆ బాధ వలన రంభ నాట్యం సరిగా చేయలేక పోయినది, ఆ కిటకముల బాధతో ఆమె చెండును క్రిందపడవేసినది. కావున ఊర్వశినె గెలుపొందినదని నా నిశ్చయం" అని చెప్పెను.

దేవేంద్రుడు విక్రమాదిత్యుదుని బుద్దిచతురతకు ఆనందించి, నవరత్నఖచిత స్వర్నమయమగు సింహాసనంను ఒకటి బహుమతిగా ఇచ్చి , "నీవీ సింహాసనముపై కూర్చుండి వేయిసంవత్సరములు రాజ్యపాలన చేయగల" వని వరమిచ్చి ఆశీర్వదించి రథమున కూర్చుండబెట్టి ఉజ్జయినికి పంపెను.



దీపం క్రింద నీడ సహజం - మనిషి బ్రతుకులో తప్పులు సహజం

No comments:

Post a Comment