Sunday, 15 February 2009

సుందోపసుందులు


పూర్వం సుందోపసుందులు అనే అన్నదమ్ములు బ్రహ్మచేతిలో "ఎవరి చేతిలో చావకుండా" వరం పొంది తమ బలపరాక్రమాలతో చాలా రాజ్యాలు జయించి దేవతలని, ప్రజలని పీడిస్తూ పరిపాలన సాగిస్తూ ఉండేవాళ్ళు. వీల బాధలు పడలేక, దేవతలు ప్రజలు శివుడికి పోరపెట్టుకుంటే, శివుడు వెళ్లి విష్ణు మూర్తిని అడగమన్నాడు.

సరే వీళ్ళంతా కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకున్నారు. విష్ణుమూర్తి విని అభయం ఇచ్చాడు, వీళ్ళ సంగతి నేను చేస్తాను అన్ని చెప్పి పంపాడు.

ఒకసారి సుందోపసుందులు వేటకోసం అడవికి వెళ్లి, అలసిపోయి ఒకచోట విశ్రమించారు. అప్పుడు వారికీ ఒక త్రిలోక సుందరి కనిపించింది. అప్పుడు వాళ్ళు ఇద్దరూ, ఆమె అందానికి ముగ్ధులై ఎవరికీ వారు ఆమెను చేపట్టాలి అని ఉవ్విళ్ళూరసాగారు. ఇంతకీ ఆ అతిలోకసుందరి ఎవరనగా మోహినీ రూపం దాల్చిన విష్ణుమూర్తి.

వీళ్ళు వెంటపడగా, మోహిని వారినుద్దేశించి "సుందరులారా! మీలో ఎవరో ఒకరినే నేను నా భర్తగా అంగీకరించగలను, మరి మీలో మీరు ఎవరు బలవంతులో తేల్చుకుని, అలా గెలిచిన వారే నన్ను చేపట్టాలి" అని అనగానే, సుందోపసుందులు పోట్లాడుకోవటం మొదలుపెట్టారు.

సుందుడు "నేను పెద్దవాడిని, కాబట్టి ఈమె నాకు రాణి కావలెను" అని, ఉపసుందుడు ఏమో, "ముందుగా ఆమెను నేను చూసాను, కాబట్టి ఆమె నా సొత్తు" అని వాదనకి దిగి ఒకళ్ళనొకళ్ళు పొడుచుకుని చచ్చారు.

అప్పటినుంచి, లోకంలో దుర్మార్గులయిన అన్నదమ్ములు గాని, మిత్రులు గాని తమలో తామే పోట్లాడుకోవటం జరిగితే వారిని సుందోపసుందులు అంతం పరిపాటి అయ్యింది.


మూర్ఖుని హృదయం నోటిలో ఉంటుంది - వివేకుడి నోరు అతని హృదయంలో ఉంటుంది

No comments:

Post a Comment